TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సన్యాసి అవ్వాలనుకున్న మోదీ

Published on: Mon May 4, 2015 3:25PM

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ మహారాజ్ ను కలవనున్నారు. 97 ఏళ్ల ఆత్మస్థానంద్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వచ్చే శనివారం ఆత్మస్థానంద్ మహారాజ్ ను కలుసుకోవడానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్ నందా మహారాజ్ మాట్లాడుతూ.. ఆత్మస్థానంద్ మహారాజ్ ను మోడీ గురువుగారిగా భావిస్తారని, వారి సలహాలు తీసుకునేవారని చెప్పారు. 2013లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వామీజీ ని కలిసారని, అయితే మోడీ ప్రధాని అయిన తరువాత తమ ఆశ్రమానికి రావల్సిందిగా కోరుతున్ననని ఆత్మస్థానంద్ మహారాజ్ రాసిన లేఖలో ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సన్యాసిగా చేరేందుకు వచ్చిన నువ్వు ఇప్పుడు భారత ప్రధానిగా మఠంలోకి వస్తుంటే చూడాలని ఉందని ఆయన ఆ లేఖలో రాసినట్టు సమాచారం. అయితే అప్పుడు సన్యాసిగా చేరేందుకు వెళ్లిన ప్రధాని మోడీని ఆపి రాజకీయాల్లోకి వెళ్లాలని చెప్పింది ఆత్మస్థానంద్ మహారాజ్ స్వామీజీయేనట.