పులితోనే గేమ్స్ ఆడుతున్న ప్రధాని మోడీ..
posted on Nov 1, 2016 4:17PM
ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఇవాళ రాష్ట్ర ప్రజలకు పండుగరోజని, ఈ సమయంలో తాను ఇక్కడ గడపడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రజలు అటల్ బిహారీ వాజ్పేయ్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. 2000 సంవత్సరంలోనే ఆయన హయాంలో ఛత్తీస్గడ్తోపాటు ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ర్టాలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఫొటోగ్రాఫర్గా మారారు. అక్కడి నందన్ వన్ జంగిల్ సఫారీకి వెళ్లిన ఆయన అక్కడే ఎన్క్లోజర్లో ఉన్న పులిని ఫొటో తీసే ప్రయత్నం చేశారు. పులికి మరీ దగ్గరగా వెళ్లి ప్రధాని ఫొటో తీయడానికి ప్రయత్నించారు. ఆయన వెంట చత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ కూడా ఉన్నారు.