చిక్కుల్లో పాక్ ప్రధాని...

 


నల్లధనానికి సంబంధించి పనామా పేపర్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపర్లలో పాకిస్థాన్ ప్రధాని మంత్రి న‌వాజ్ షరీఫ్ పేరు కూడా బయటపడిన సంగతి విదితమే.. అయితే ఇప్పుడు ఈ విషయంలో న‌వాజ్ ష‌రీఫ్ చిక్కుల్లో ప‌డ్డారు. ప‌నామా ప‌త్రాల కుంభ‌కోణంలో ష‌రీఫ్‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై విచార‌ణ‌కు ఆదేశించింది పాక్ సుప్రీంకోర్టు. ఈ మేర‌కు ఓ న్యాయ‌మూర్తి నేతృత్వంలో విచార‌ణ క‌మిష‌న్‌కు కూడా నియ‌మించింది. ఈ క‌మిష‌న్‌కు సుప్రీంకోర్టుకు ఉండే అన్ని అధికారాలను క‌ట్ట‌బెట్టింది. ఈ కేసులో రోజువారీ విచార‌ణ జ‌ర‌ప‌డానికి కూడా సుప్రీంకోర్టు అంగీక‌రించింది.