ఆత్మహత్యలపై మోడీ ఆవేదన

posted on: Apr 23, 2015 3:30PM

 

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన దర్నాలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎప్పటినుంచో కలచివేస్తున్నాయని, అలాంటి రైతుల సమస్యలను అర్ధం చేసుకొని వారి సమస్యలకు పరిష్కారాన్నికనుక్కోవాలన్నారు. మనిషి జీవితం కన్నా గొప్పది ఏదీ లేదని, రైతులు అలాంటి జీవితాన్ని కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. బాధితుల కుటుంబాలు పడే బాధను తాను అర్ధం చేసుకోగలనన్నారు. రైతుల ఆత్మహత్యలు అనాదిగా కొనసాగుతున్న దౌర్భాగ్యమైన పరిస్ధితికి నిదర్శనం అని ప్రధాని ఆవేదన తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...