నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి
posted on Jun 16, 2014 7:31AM
కృష్ణాజిల్లా నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే నందిగామలోని మదర్థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. అరుుతే 12 గంటల సమయంలో ఆయన కన్నమూశారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా ఆయన నందిగామ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం తంగిరాల ప్రభాకరరావు స్వస్థలం. ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి ఆదివారం ఉదయ పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.