చక్రి మీద విష ప్రయోగం జరిగిందా?

 

రెండు రోజుల క్రితం మరణించిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మీద విష ప్రయోగం జరిగిందా? ఈ అనుమానాన్ని చక్రి తల్లి, ఆమె సోదరుడు, ఇతర చక్రి తరఫు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. చక్రి భార్య శ్రావణి చక్రికి విషం పెట్టిందని వారు ఆరోపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని చక్రి భార్య శ్రావణి వెల్లడించారు. చక్రి తరఫు బంధువులందరూ ఆస్తికోసం తనను వేధిస్తున్నారని, చక్రిని నేనే విషం పెట్టి చంపానని బెదిరించడం ద్వారా ఆస్తి మొత్తాన్నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఈ విషయంలో ఆమె మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. తన భర్తను తాను ఎందుకు చంపుకుంటానని ఆమె ప్రశ్నిస్తున్నారు. తన భర్త చక్రిని తాను అపురూపంగా చూసుకునేదానినని, ఆయన తరఫు బంధువులే ఆయనను ఒక డబ్బు సంపాదించే యంత్రంలా భావించేవారని శ్రావణి ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చక్రి చనిపోయిన బాధలో వున్న ఆయన అభిమానులకు ఆయన కుటుంబ సభ్యులు ఆస్తి కోసం ఇలా వీధిలో పడటం, మీడియాకు ఎక్కడం మరింత బాధకలిగిస్తోంది.