అధికారికంగా ప్రకటించండి.. ప్రజలు సంతోషిస్తారు

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓ లేఖ పంపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని జగన్‌ కు ఎంపీ గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేయాలని సీఎం జగన్ ను ఆయన కోరారు. కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపీ క్యారాలయం ఈరోజు మీడియాకు విడుదల చేసింది.