మోడీకి కోపమొచ్చింది



ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందంటూ సోనియాగాంధీ చేసిన విమర్శలను ప్రధాని నరేంద్రమోడీ తిప్పికొట్టారు. సోనియా వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన మోడీ...కాంగ్రెస్ ను అవినీతి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిందని, అందుకే తమపై బురద చల్లుతున్నారని మోడీ ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకుని, కాంగ్రెస్ నేతలు చీప్ గా బిహేవ్ చేశారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమిని సోనియా ఇంకా జీర్జించుకోలేకపోతున్నారని, అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ముచేయబోమన్న మోడీ... ఏ ఆశయంతో తమను గెలిపించారో...దాన్ని సాధించి చూపిస్తామన్నారు మోడీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu