ప్రతి దానికీ గొడవే.. చంద్రబాబు

 

ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆయన విర్డ్స్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర విడిపోయి ఆర్ధిక సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షనేతలు మాత్రం దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్క పనికి అడుపడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17వేల ఎకరాల అటవీ భూమి ఉందని.. అటవీ భూములను డీనోటిఫై చేసి పరిశ్రమలను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో అక్వా విశ్వవిద్యాలయం..గోపాలపురంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు, పేదలు సంతోషంగా ఉండలనేదే తన తాపత్రయమని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu