గంటావారింట్లో బాజా బంత్రీలు

posted on: Oct 3, 2015 10:48AM

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మునిసిపల్, పట్టణ అభివృద్ధిశాఖ మంత్రి పి. నారాయణ ఇళ్ళలో బాజా బజంత్రీలు మ్రోగబోతున్నాయి. వారిరువు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. గంటావారి రెండవ కుమారుడు రవితేజ, నారాయణ గారి రెండవ కుమార్తె శరణికి ఈనెల 30వ తేదీన నెల్లూరులో వివాహం జరుపబోతున్నారు. ఆ తరువాత నవంబర్ 4వ తేదీన వైజాగ్ లో రిసెప్షన్ పార్టీ జరుగుతుంది. ఇంతవరకు పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్న వారిరువురూ బందువులు అవుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...