మంత్రుల కోసం తాను ఓడి సిబిఐని గెలిపించిన కాంగ్రెస్?
posted on Sep 18, 2012 10:30AM
ప్రభుత్వంలో మంత్రులు లేకపోతే పాలన స్తంభిస్తుందా? స్తంభించదు కానీ, పనిభారం సిఎంపై పడుతుంది. ఈ పనిభారానికి వెరసి మంత్రులను మినహాయించి మనుగడ సాగించటమే కష్టమన్న ధోరణి అథికార కాంగ్రెస్ అవలంబిస్తోంది. దీని పర్యావసానమే తనపై ఆరోపణలు వచ్చినందుకు రాజీనామా చేసినా రెవెన్యూశాఖామంత్రిగా ధర్మానప్రసాదరావు కొనసాగటమే. తాను రాజీనామాకే కట్టుబడి ఉన్నా రాష్ట్రప్రభుత్వం దాన్ని ఆమోదించలేదని ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ప్రభుత్వం డొల్లతనం వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంలో బయటపడినట్లు అయింది. స్వయంగా తన సమర్థతను ప్రచారం చేసుకోవటంలో ధర్మాన ఒరకంగా సక్సెస్ అయినట్లే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా ఆమోదించకపోయినా వాన్పిక్ కేసులో ఈయన ప్రధాననిందితుడు. సిబిఐ ఛార్జీషీటులో ఈయన పేరు నమోదు చేసింది. దీని విచారణ నిమిత్తం ఈ నెల 25న సిబిఐకోర్టుకు హాజరుకావాలని ధర్మానకు సమన్లు పంపించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చరిత్ర లేని నేతలను మంత్రులుగా నియమించటంలో వైఫల్యం చెందిందని విమర్శలను ఎదుర్కొంటోంది. ఒకరకంగా ధర్మాన రాజీనామాను ఆమోదించకపోవటం ప్రభుత్వ ఓటమిని చాటుతోంది. ఛార్జిషీటు దాఖలు చేసి తదనంతరం సిబిఐ కోర్టులో బలమైన వాదనలను అందించటం ద్వారా సిబిఐ ఒకరకంగా తన గెలుపును చాటుకుంటోంది. కాంగ్రెస్ ఓడిపోయి సిబిఐను గెలిపించటం ఒకరకంగా స్పోర్టీవ్స్పిరిట్గా తీసుకోవాలంటే ఇది ఆట కానేకాదు. మరి కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయినట్లు నటిస్తోంది.