మోడీ దయ్యం లాంటోడు: మమతా బెనర్జీ మండిపాటు

 

 

 

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దయ్యం లాంటోడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల సూత్రధారి నరేంద్రమోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశానికి చీకటి రోజులు ప్రారంభమవుతాయని ఆమె ఆగ్రహంగా చెప్పారు. ‘‘గుజరాత్‌లో అల్లర్లకు కారణమైన మోడీ ఇప్పుడు తన దృష్టిని పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించాడు. ఇక్కడ కూడా గుజరాత్ తరహా అల్లర్లు జరగాలని మోడీ పథక రచన చేస్తున్నాడు’’ అని మమత మోడీ మీద విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి మోడీ ప్రస్తావించడాన్ని మమత ఖండిస్తూ, గుజరాత్ అల్లర్ల కారకుడి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం బెంగాలీ ప్రజలకు లేదని ఆమె అన్నారు.