తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం: మమతా

 

 

 

పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము విభజనకు వ్యతిరేకమని, సమైక్యానికే మద్దతు తెలుపుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించే తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ తెలిపారు. గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మమతా బెనర్జీ ని కలిసి సమైక్యానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈరోజు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మమతాతో భేటి అయ్యే అవకాశం వుంది. ఆయన తెలంగాణ తో పాటు ఇతర రాజకీయాలపై మాట్లాడే అవకాశం వుంది.