Latest News

మహారాష్ట్రలో ఎంఐఎం బోణీ చేసింది

posted on: Oct 20, 2014 9:34AM

 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం రెండు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బోణీ కొట్టింది. ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబై నగరంలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించారు. ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎంఐఎం మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...