లక్ష కు పైగా ఐసోలేషన్ బెడ్స్ రెడీ: లవ్ అగర్వాల్

దేశవ్యాప్తంగా 7447 కేసులు నమోదయ్యాయని, 239 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  6,565 యాక్టివ్  కేసులకుగాను , 643 మంది కోలుకున్నారని చెప్పారు.  గడిచిన 24 గంటల్లో 1,035 కొత్త కరోనా కేసులు నమోద, 40 మంది మృతి చెందారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు.  లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారత్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu