నువ్వు సీఎం అయితే ఏంటి?.. మాకు మోదీ ఉన్నారు జాగ్రత్త

 

బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆపితే నేనెవరి మనిషినో తెలుసా? నా వెనుక ఎవరున్నారో తెలుసా? అనే మాటలు వింటుంటాం.. కానీ వెరైటీగా కర్ణాటక రాజకీయాల్లో ఇలాంటి సంఘటన జరిగింది.. నేను సీఎంని అనే విషయం మర్చిపోకు అని కుమార స్వామి అంటే.. మాకు పీఎం మోదీ ఉన్నారని మర్చిపోకు అంటూ ప్రతిపక్ష నేత యడ్యూరప్ప.. ఇలా ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.. ఇంతకీ మేటర్ ఏంటంటే.. యడ్యూరప్ప రాత్రిపూట జేడీఎస్ శాసన సభ్యులకు ఫోన్ చేసి మా పార్టీలోకి వచ్చేయాలని, మంత్రి పదవి ఇస్తామని బేరాలు పెడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు.. ఇలా ఎమ్మెల్యేలకు గాలం వేసి దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తే తాను చూస్తూ ఉండనని హెచ్చరించారు.. అంతేకాదు తన చేతిలో అధికారం ఉన్న విషయం మరిచిపోయి మాట్లాడితే ఏం చెయ్యాలో అది చేస్తానని యడ్యూరప్పను, కుమారస్వామి హెచ్చరించారు.. కర్ణాటకలో మాత్రమే కుమారస్వామికి అధికారం ఉందని, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న విషయం వారు మరిచిపోయారని యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు.. కుమారస్వామి చేస్తున్న బెదిరింపులకు బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్దంగా లేరని యడ్యూరప్ప అన్నారు.