మురికికూపంగా మారుతున్న ఏపీ సచివాలయం

 

ఆలయంలా చూసుకోవాల్సిన సచివాలయం మురికినీరు వలయంలో చిక్కుకొని 'ఈ కంపు భరించడం నా వల్ల కాదు మహాప్రభూ' అంటూ ముక్కు మూసుకొంటోంది.. ఇది ప్రస్తుతం ఏపీ సచివాలయం పరిస్థితి.. దీనంతటికి కారణం అక్కడి క్యాంటీన్.. ఆ క్యాంటీన్ లో ఫుడ్ ఎలా ఉందో తెలీదు కానీ.. దానిలో పాత్రలు,ఇతర సామాగ్రి శుభ్రం చేసిన మురికి నీరంతా సచివాలయం పరిసరాల్లోకి వెళ్తూ అక్కడ గబ్బు కొట్టిస్తున్నాయి.. క్యాంటీన్ నుంచి సరైన పైప్ లైన్ లేకపోవడంతో మురికి నీరు ఆ చుట్టూ పరిసరాల్లో విస్తరిస్తూ దుర్గంధం వెదజల్లుతుంది.. ఇది చాలదు అన్నట్టు ఆ అపరిశుభ్ర వాతవరణంలోనే సచివాలయ క్యాంటీన్ వంటశాల ఉంది.. వింటుంటేనే ఏదోలా ఉంది కదా.. మాట్లాడితే 'స్వఛ్ భారత్' అంటూ శుభ్రంగా ఉండాలి, దేశాన్ని శుభ్రంగా ఉంచాలని నీతులు చెప్పే ప్రతినిధులు, అధికారులకు సచివాలయం పరిసరాల్లో మురికినీరు కనిపించట్లేదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. స్వఛ్ భారత్ తరువాత.. ముందు స్వఛ్ సచివాలయం చేపట్టి సచివాలయాన్ని ఆ కంపు నుండి కాపాడండి అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.. మరి ఇప్పటికైనా మురికినీరు పోవడానికి సరైన పైప్ లైన్ ఏర్పాటు చేసి తప్పు సరిదిద్దుకుంటారేమో చూడాలి.