రాజీనామాకు రెడీ.. కేటీఆర్

 

వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారని.. టీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారని అంటూ వస్తున్న వార్తలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అది కేవలం మీడియా సృష్టే అని మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే పాలిస్తుందని.. కావాలనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికలో వరంగల్ అభ్యర్ధి కనుక ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పడికి ఏడాదిన్నర పైన అవుతుంది... ఇప్పటివరకూ ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది లేదు.. కనీసం తెలంగాణ గురించి మాట్లాడింది లేదు.. అలాంటిది బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు.. అసలు వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu