జనం రోడ్ల మీద పడ్డారు... మళ్లీ మోడీపై కేజ్రీవాల్

 

పెద్ద నోట్ల రద్దుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన మోడీపై మండిపడ్డారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో జనం రోడ్ల మీద పడ్డారని... దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు అంశం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం పాటించిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విధించిన ఈ శిక్ష న‌ల్ల‌ధ‌నం ఉన్న‌ పెద్ద‌ల‌కు కాదని, పేద‌ల‌కేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల ర‌ద్దును ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతూ తాము రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌ల‌వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.