చిల్లర కష్టాలు.. త్వరలో 20, 50 నోట్ల‌ు

 

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర కోసం పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందుల నుండి కాస్త బయటపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్వ‌ర‌లోనే రూ. 20, 50 నోట్ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌ప‌ర్స‌న్ అరుంధ‌తి భ‌ట్టాచార్య తెలిపారు. ప్ర‌స్తుతం ఏటీఎంల‌లో డ‌బ్బు ఊహించిన దాని కంటే చాలా త్వ‌ర‌గా అయిపోతుండ‌టంతో త‌మ సిబ్బంది అంతా అదే ప‌నిలో ఉన్నార‌ని, ఈ నెల చివ‌రిలోగా ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆమె చెప్పారు. ఆ త‌ర్వాత తాము రూ.20, 50 నోట్ల పంపిణీ మొద‌లుపెడుతామ‌ని అన్నారు.