కమల్, చంద్రబాబును కలిసింది అందుకేనా?

ఏపీ సీఎం చంద్రబాబుతో సీనీ నటుడు కమల్ హాసన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు ఎందుకు భేటీ అయ్యారో తెలియదు కానీ.. భేటీపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన "చీకిటి రాజ్యం" సినిమా ప్రీమియర్ షోకు చంద్రబాబును ఆహ్వానించడానికే కలిశానని కమల్ హసన్ చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఏపీ రాజధానిలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి అందరూ ఉవ్విళూరుతున్నారు. కొత్త రాష్ట్రం.. అందునా కొత్త రాజధాని ఇక్కడ పెట్టుబడులు కానీ.. పరిశ్రమలు కానీ పెడితే మంచి లాభాలు చేకురుతాయని అందరూ చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ చంద్రబాబును కలిసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటివరకూ సినిమా షూటింగ్ లకు అనువైన ప్లేస్ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు రామోజీ ఫిలిం సిటీ. చిన్న సినిమా దగ్గర నుండి పెద్ద సినిమాల వరకూ ఏదైనా షూటింగ్ చేసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. అలాంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి మరో స్టూడియో ఉండాలన్నదే కమల్ కోరికట.  ఈ నేపథ్యంలో కమల్, బాబుతో తమ మనసులో మాటను బయటపెట్టారట. దీనిలో భాగంగా అమరావతిలో కమల్ సొంతంగా ఓ ఫిలిం ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాలని.. అందుకు సంబంధించిన భూముల కేటాయింపులు.. మౌలిక వసతుల కల్పన తదితర విషయాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సినీ హీరోలు కూడా ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu