భారీ ఎన్ కౌంటర్... 12 మంది మృతి

ఝార్ఖండ్ పలము జిల్లా సత్ బర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నిన్న రాత్రి 2.30 గంటలకు పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాల ప్రకారం... సత్ బర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేయగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు తెగబడటంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు చేశామని అధికారులు తెలిపారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu