నకిలీ సర్టిఫికేట్లతో ఢిల్లీ మంత్రి తోమర్ అరెస్ట్

నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుండి పొందిన డిగ్రీ పట్టా నకిలీదని గతంలోనే తోమర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తోమర్ నకిలీ సర్టిఫికేట్లపై దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి అవి నకిలీ సర్టిఫికెట్లుగా స్ఫష్టంచేశారు. అంతేకాక బిహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి ఆయన పొందిన ఎల్‌ఎల్‌బీ పట్టా కూడా నకిలీదని తేలినట్టు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తోమర్ ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu