భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలి: జైపాల్

 

 

 

 

జీవోఎంతో తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటిలో తెలంగాణ కేంద్ర మంత్రులు 12పేజీల నివేదికను జీవోఎంకు అందజేశారు. జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...భద్రాచలంతో కూడిన తెలంగాణకావాలన్నారు. హైదరాబాద్ తెలంగాణాలో భాగమని అన్నారు. హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పెట్టడమనేది చరిత్రలో అపూర్వమని అన్నారు. హైదరాబాద్ రెవెన్యూ పంపిణి విషయం చర్చకు రాలేదన్నారు. 371-డీ పై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఓకే అభిప్రాయంతో ఉన్నారని, 371-డీ ని కొనసాగించాలన్నారు. కృష్ణా జలాల పై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరి జలాలపై ట్రైబ్యునల్ అవసరం లేదని అన్నారు. జీవోఎంకు లిఖిత పూర్వఖ నోట్ ఇచ్చామని, విదాన నిర్ణయాలు తీసుకోనే౦తవరకు నోట్ ను విడుదల చేయమని చెప్పారు.