జగన్ జెండాను మార్చుకోవాలి

జగన్ తమ పార్టీ జెండాను, అజెండాను మార్చుకోవాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖామంత్రి తోట నర్సింహం సలహా ఇస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తన అజెండాలో వై.ఎస్.ఆర్. చుట్టూ సాక్షిపత్రిక, ఇందిరాచానల్, ఎం.ఆర్. కుంభకోణం, వాన్ పిక్ భూములు, మనీలాండరింగ్ చిత్రాలను చేర్చాలని మంత్రి సూచించారు. 2012 ఉపఎన్నికలంతా జగన్ ను విమర్శించాటానికే కాంగ్రెస్ నాయకులంతా సమయాన్ని వెచ్చిస్తే రామచంద్రాపురం అసెంబ్లీ ప్రచారంలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను విశదీకరిస్తూ అభ్యర్థి తోట త్రిమూర్తులు విజయానికి తోట నర్సింహం కృషి చేశారు. ఎన్నికల తరువాత ఆయన జగన్ పై చేసిన విమర్శ ఏమిటంటే ఒకటి ఆ పార్టీ జెండా మార్పు చేయాలని సూచన, రెండోది రాష్ట్రాన్ని దోచుకునే వారిని తూర్పుగోదావరి జిల్లాలో నమ్మరని త్రిమూర్తులు విజయం చాటిచెప్పిందన్నారు. ఇంక రెండు విమర్శలూ ఓకే మరి మంత్రిగారు తన మూడో విమర్శ ఎప్పుడు చేస్తారో అని పలువురు ఎదురుచూస్తున్నారు. మొదటి రెండు కొత్తదనంతో కూడిన విమర్శలకు ధీటుగా మూడోది ఉండాలని ఆయనకు పలువురు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu