షార్‌లో రాకెట్ ప్రయోగం వాయిదా..ఏఎన్-32నే కారణం

ఆరు రోజుల క్రితం గల్లంతైన భారత వాయుసేన ఏఎన్-32 విమానం కోసం సైన్యం అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అయినప్పటికి విమానం జాడ మాత్రం తెలియరాలేదు. దీని ప్రభావం భారత అంతరిక్ష రంగంపై పడింది. ఇస్రో తయారు చేసిన అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ వాహక నౌకను నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగాన్ని ఇస్రో వాయిదా వేసినట్లు సమాచారం. ఆదృశ్యమైన విమానం కోసం పలు నౌకలు, విమానాలు, చాపర్లు బంగాళాఖాతంలో గాలిస్తున్నందున ఈ రాకెట్ ప్రయోగానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లభించలేదని సమాచారం. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేశామని, దీన్ని తిరిగి ఎప్పుడు ప్రయోగించేది త్వరలోనే నిర్ణయిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి.