హుబ్లీలో దగ్థమైన బస్సు..ముగ్గురి మృతి

కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు దగ్థమైంది. బెంగుళూరు-పుణే జాతీయ రహదారిపై వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుబ్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.