తెలంగాణ ఇంటర్ ద్వితీయ ఫలితాలు

posted on: Apr 27, 2015 10:28AM

 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 61.41శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలుర కన్నా బాలికలే ఆధిక్యం సాధించారు. రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మార్చి 9 నుంచి 27 వరకు జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు 5,06,789 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.77 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,78,972 మంది ఉండగా 93,567 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ఒకేషనల్ విభాగంలో 34 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...