TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాటలొద్దు... చేతలతో సాయం చేయండి...

Published on: Wed Oct 15, 2014 1:48PM

 

హదూద్ తుఫాను వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారికి మాటలతో కాకుండా చేతలతో సాయం చేయాని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మార్గంలో విశాఖకు వెళ్తున్న ఆయన బుధవారం మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దివిసీమ ఉప్పెన తర్వాత ఇదే పెద్ద తుఫాను. నేను విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించనున్నాను. బాధితులకు అవసరమైన సాయం అందిస్తాను. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీఐపీలు ఎంత తక్కువ వస్తే అంత మంచిది. ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు వల్లే నష్టం తగ్గింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట మీద నిలబడే వ్యక్తి అని అందుకే ఇటీవల ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చాను. త్వరలో కేంద్ర మంత్రులతో మాట్లాడి మరింత సాయం కోరతాను’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.