కేసీఆర్ మొదటి దోషి.. స్టీఫెన్ సన్ రెండో దోషి.. గాలి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కేసీఆర్ పై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అసలు మొదటి దోషి కేసీఆర్ అని రెండో దోషి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వీళ్లిద్దరిపై టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలులోనే ఉందని ఇప్పటికే కోర్టు తీర్పు నిచ్చింది.. ఉమ్మడి రాజధానిలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం పెత్తనం చూపడానికి కుదరదని.. ఏదైనా చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని.. గవర్నర్ కు అన్ని అధికారాలుంటాయని అన్నారు.