రైతుసమస్యలపై గలం విప్పనున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ?
posted on Jun 21, 2012 9:34AM
రైతాంగ సమస్యలపై గలం విప్పేందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తొలినాళ్ళలో విజయవాడలో రైతు సమస్యలపై జగన్ ఆందోళన చేశారు. ఇప్పుడు విజయమ్మ కూడా అదే సీరియస్ నెస్ ఉన్న సమస్యలను ఎంచుకున్నారు. 2010 నాటి ఇన్ పుట్ సబ్సిడీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోతే ఆందోళన తప్పదని అనంతపురం అమ్మేల్యే గుర్నాధరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ మహాధర్నాకు విజయమ్మ నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. దాదాపు రెండేళ్ళ క్రితం నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవటం, ఆ తరువాత జరిగిన పంట నష్టాన్ని గుర్తించకపోవటాన్ని కూడా తమ పార్టీ తప్పుపడుతోందన్నారు. గుర్నాధరెడ్డి మాటలను బట్టి విజయమ్మ పార్టీ తరపున పోరాడే పార్టీ అన్న గుర్తింపును సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. విజయమ్మతో పాటు షర్మిల కూడా ఇటువంటి ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.