530 మందికి ఒకేసారి అంత్యక్రియలు

 

నేపాల్ లో వచ్చిన భారీ భూకంపానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపంలో శిథిలాల కింద వెలికితీసిన 530 మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించనున్నామని నేపాల్ అధికారులు తెలిపారు. భూకంపం వచ్చి ఇప్పటికి 9 రోజులైనా నేపాల్ లో ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూకంప ప్రభావం సుమారు 80 లక్షల మంది మీద పడగా, దాదాపు లక్షా అరవై వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు ఏడు వేల మంది మరణించారు. అయితే శిథిలాల వెలికితీత మొత్తం పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య దాదాపు పదిహేను వేలకు పైగా ఉండవచ్చని నేపాలి ప్రధానమంత్రి సుశీల్ కోయిరాలా తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం మరో ఏడుసార్లు భూమి స్వల్పంగా కంపించడంతో నేపాలు ప్రజలు భయభ్రాంతులయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu