దేవినేని టీడీపీ ఎంట్రీకి డేట్ ఫిక్స్..

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలకు తెరపడింది. ఇప్పటికే పలు టీడీపీ నేతలు నెహ్రూతో మంతనాలు జరిపారు. ఇక ఆఖరిగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా చర్చలు ముగిసిన అనంతరం దేవినేని నెహ్రూ, అతని తనయుడు అవినాష్ ల టీడీపీలో చేరడానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో వారంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని.. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.