ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్...

 

పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. అలా ప్రారంభమయ్యాయో లేదో సభలో గందరగోళం మొదలైంది. గోరక్షణ పై ప్రతిపక్ష పార్టీల సభ్యులు స్పందిస్తూ.. గోరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలపై చర్చించాలంటూ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయి.. మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు స్పీకర్ సుమిత్రా మహాజన్ పై పేపర్లు చింపి విసిరేయడంతో ఆగ్రహానికి గురైన ఆమె ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, కే సురేష్, రంజిత్ రంజన్, సుష్మిత దేవ్, ఎంకే రాఘవన్ లను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu