తెరాసలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు

 

తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిరిపూర్ కాకజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాభీ కండువా కప్పుకున్నారు. వీరిద్దరి చేరికతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 65కు చేరింది. మరోవైపు పీఆర్‌టీయూ, కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, గోపాల్ రెడ్డి, రాజలింగం. పీఆర్టియూ ఎమ్మెల్సీలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్ మరో మాజీ టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నారు. పీఆర్టీయూ మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కూడా గులాబీ గూటికి చేరారు.