ఇళ్ళమీద నుంచి దూసుకెళ్ళిన విమానం

 

కాంగోలో ఒక విమానం విమానాశ్రయంలో దిగే సమయంలో విమానాశ్రయం పక్కనే వున్న నివాసాల మీద నుంచి దూసుకుని వెళ్ళడంతో ఆ ఇళ్ళలో నివసించే ఏడుగురు వ్యక్తులు మరణించారు. సర్వీసెస్ ఎయిర్ కంపెనీకి చెందిన ఒక కార్గో జెట్ విమానం ముజి - మయిలోని విమానాశ్రయంలో లాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే విమానం మాత్రం ఎలాంటి సమస్య లేకుండా విమానాశ్రయంలో దిగింది. ముజీ - మయి విమనాశ్రయంలో సదుపాయాలు సరిగా లేవన్న ఉద్దేశంతో గతంలో కొద్దికాలంపాటు ఈ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిషేధించారు. ప్రజలు వత్తిడి చేయడంతో ఇటీవలే విమానాల రాకపోకలకు అనుమతించారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu