నన్ను ఆంధ్రా పంపించవద్దు ప్లీజ్.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం..

 

ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ జూన్ 27 నాటికి ఏపీ రావాలని చెబుతున్నారు. మరోపక్క ఉద్యోగులు మాత్రం ఏపీకి రావడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. కొంతమంది ఉద్యోగులైతే .. స్వచ్చంద పదవీ విరమణ చేద్దామని కూడా నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ఆంధ్రాకు వెళ్లి తాను ఉద్యోగం చేయలేనని, తెలంగాణలోనే ఉంటానంటూ ఒక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని అగ్రికల్చరల్ కమిషనర్ కార్యాలయం ఎదుట సదరు ఉద్యోగి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉద్యోగిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తనను ఆంధ్రాకు పంపవద్దని ఆ ఉద్యోగి విజ్ఞప్తి చేశాడు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.