చిత్తూరు ఘటన హేయమైంది.. చంద్రబాబు

posted on: Nov 17, 2015 1:49PM

 

చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధ దారుణహత్యకు గురైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆమె పృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఘటన చాలా హేయమైనదని అన్నారు. రాజకీయ ముసుగులో కొంతమంది అరాచకాలు సృష్టిస్తున్నారని.. గత పదేళ్లు అరాచకాలు సృష్టించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిందుతుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టేది లేదు.. శాంతి భద్రతల్ని కాపాడటమే మా లక్ష్యం.. శాంతి భద్రతలకి భంగం కలిగించేవారిని ఉపేక్షించమని మండిపడ్డారు. కాగా కటారి అనురాధ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...