TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీ పరువు తీస్తున్నారు.. చంద్రబాబు

Published on: Mon Oct 26, 2015 10:44AM



వరంగల్ ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో టీ టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో దూషించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జరిగిన గొడవ గురించి చంద్రబాబు ఫోన్ చేసి తెలుసుకోగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. ఈసందర్బంగా చంద్రబాబు పార్టీ నేతలపై మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నికల సందర్బంగా ఈ గొడవలు ఏంటి.. పార్టీ పరువును తీస్తున్నారు అని పార్టీనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా సోమవారం నాడు నేతలను విజయవాడ రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ నేతలందరూ ఒకటై రేవంత్ రెడ్డిని ఒంటరి వాడిని చేశారన్న ఆరోపణలపై..  గొడవ పడకుండా రేవంత్‌రెడ్డికి సహకరిస్తూ పార్టీ కార్యక్రమాలను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని ఆగ్రహంగా చెప్పారని సమాచారం. కాగా తనపై నేతలు ప్రవర్తిస్తున్న తీరును.. నేతలు తనను అవమానిస్తున్నా, దూషిస్తున్నా పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డు చెప్పలేదని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.