సిటీలైట్ విషాదం: 16కు చేరిన మృతులు

 

Citi Lite Hotel building, Citi Lite Hotel building collapsed

 

 

సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మరోవైపు సిటీలైట్ హోటల్ శిథిలాల తొలగింపు శరవేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజుతో శిథిలాల తొలగింపు పూర్తవుతుందని ఆయన తెలిపారు. హోటల్ కూలిన ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. అలీ,భరత్, వెంకటేష్,కిరణ్ అనే నలుగురు వర్కర్ల ఆచూకీ గల్లంతవడంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు సిటీలైట్ హోటల్ కూలడంతో పాతభవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. పాతభవనాలను ఉపేక్షించేది లేదని కమిషనర్ కృష్ణబాబు తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఆయన తెలిపారు.