చోటా రాజన్ పట్టుబడటానికి అసలు కారణం అదా?



అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ముంబై పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండోనేషియాలో ఉన్న ఆయనను నిన్ననే ఇండియాను తీసుకొచ్చారు. అయితే అసలు చోటా రాజన్ పట్టుబడటానికి అసుల కారణం వేరే ఉందంటున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు. వివరాల ప్రకారం.. చోటా రాజన్ రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయంట. ప్రస్తుతం ఆయన రోజూ డయాలసిస్ చేయించుకుంటూ బ్రతుకుతున్నారంట. అయితే 55 ఏళ్ల చోటా రాజన్ ఎక్కువ రోజులు బ్రతకాలంటే కిడ్నిల మార్పిడి చేయాలి. అలా చేయించుకోవాలంటే డాన్ గా ఉన్న చోటా రాజన్ కు జరగని పని. విదేశాల్లో చేయించుకోవాంటే అసలే కుదురదు. అందుకే భారత్‌కు వస్తే తప్పకుండా తన కిడ్నీ మార్పిడికి అధికారులు అనుమతించే అవకాశం ఉందని రాజన్ భావించినట్టు ఓ అధికారి తెలిపారు. అయితే దీనికి సంబంధించి చోటా రాజనే ఒక సంవత్సరం నుండే ప్లానింగ్ చేస్తున్నడంటా. దీనిలో భాగంగానే వైద్య పరీక్ష వివరాలను తన కుటుంబసభ్యులకు మైయిల్ ద్వారా పంపించగా.. వారిలో తన మేనల్లుడు కిడ్ని సరిపోగా తను కిడ్నిదానం చేసేందుకు ముందుకురావడంతో చోటారాజన్ ఈ రకమైన ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu