చెన్నై.. మళ్లీ కుండపోత తప్పదు..
posted on Dec 4, 2015 10:52AM

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై వరద నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతంలో త్రివిధ దళాలు సహాయచర్యలు ముమ్మరం చేశాయి. చెన్నైలో ఉన్న 7 నదుల్లో 27 జలాశయాల్లో వరద ఉదృతి తీవ్రంగా పెరిగిపోయింది. చెన్నై సహా 13 జిలాల్లో వరద బీభత్సానికి 269 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా చెన్నైలో మళ్లీ కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో ప్రజలు ఇంకా ఆందోళనలు చెందుతున్నారు. కాగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైని ప్రధాన మంత్రి మోడీ పరిశీలించి.. తక్షణ సాయం కింద రూ 1000 కోట్లు సాయం అందిస్తామని తెలిపారు.