చంద్రబాబు ఆదివాసీ నృత్యం!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆదివాసీ మహిళలతో  కలసి నృత్యం చేశారు. డప్పు వాయించారు. కొమ్ముల కిరీటం ధరించారు. అక్కడ వున్న అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు అరకు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాల మీద అక్కడ వున్న అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News