లాపతా లేడీస్ సినిమాకు అపురూప గౌరవం.. సుప్రీం ఆడిటోరియంలో ప్రదర్శన

ఓ సందేశాత్మక చిత్రానికి అపురూప గౌరవం దక్కింది. ఆ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు తిలకించనున్నారు. శుక్రవారం (ఆగస్టు 9) సాయంత్రం సుప్రీం కోర్టు ఆడిటోరియంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శనను సుప్రీం కోర్టు రిజిస్ట్రార్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా వీక్షిస్తారు.  

లింగ సమానత్వం ఇతివృత్తంగా తెరకెక్కిన ‘లపతా లేడీస్’ అనే సినిమాకు ఈ అపూర్వ గౌరవం దక్కింది.   ఈ సినిమా  సమాజంలో లింగభేదం ఎంత తీవ్రంగా ఉందో కళ్లకుకట్టినట్లు చూపింది. సుప్రీం కోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆడిటోరియంలో ఆ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ సినిమా దర్శకురాలు కిరణ్ రావు, నిర్మాత, నటుడు అమీర్ ఖాన్ కూడా సుప్రీం ఆడిటోరియంలో సీజేఐ, న్యాయమూర్తులతో కలిసి ఈ ప్రదర్శనకు హాజరౌతారు.  

ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. కాగా సుప్రీం ఆడిటోరియంలో ప్రదర్శనకు నోచుకున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News