బాంబు పెట్టింది నేతకు... బలైంది బాడీగార్డ్

posted on: May 26, 2015 2:46PM

బీహార్ గయాలో జేడీయూ నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం మంగళవారం బయటపడింది. జేడీయూ అధ్యక్షుడు జిల్లా నేత అభయ్ కుశ్వాహ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు పార్శిల్ పంపారు. వచ్చిన పార్శిల్ ను తెరిచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో అభయ్ కుశ్వాన్ బాడీగార్డ్ అక్కడికక్కడే మరణించగా, అభయ్ కుశ్వాన్ బంధువుకు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, మావోయిస్టులకు ఈ పేలుడుపై ఎదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...