పడవ బోల్తా... 12 మంది మృతి

 

బీహార్‌లోని జముయ్ జిల్లాలో గార్హి డ్యామ్‌లో శనివారం మధ్యాహ్నం పపడవ మునిగి 12 మంది మరణించారు. 16 మందితో ప్రయాణిస్తున్న ఈ పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న నలుగురు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన వారిలో ఆరుగురి మృతదేహాలు వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నావడా జిల్లాలోని కౌవాకోల్ గ్రామానికి చెందిన వారు ఒక శుభకార్యంలో పాల్గొనడానికి గార్హి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.