Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిహార్ ఎన్నికలతో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకం కాబోతున్నాయా?
posted on: Nov 10, 2015 8:15AM
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నితీష్ కుమార్ కి చెందిన మహా కూటమికి ఓట్లేసి గెలిపించాలని డిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ మరియు మమతా బెనర్జీ బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. ఎన్నికలలో విజయం సాధించిన తరువాత నితీష్ కుమార్ కి వారిరువురు అభినందన సందేశాలు కూడా పంపారు. నితీష్ కుమార్ కూడా వారిరువురికి ఫోన్ చేసి తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ వారిరువురినీ తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి తేదీ ఖరారు కాగానే మరోమారు వారిరువురిని స్వయంగా ఆహ్వానిస్తారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. బిహార్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు, శక్తులు అన్నీ చేతులు కలిపేందుకు ఆలోచన చేస్తున్నాయి. దానికి ఇది నాందిగా భావించవచ్చును.






