ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: అసద్

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం మతపెద్దలు గురువారం భేటీ అయ్యారు. వరంగల్ - నల్గొండ జిల్లాల సరిహద్దులో తీవ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్ మీద విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కి విజ్ఞప్తి చేశారు. పోలీసులను తీవ్రవాదులు కాల్చి చంపడాన్ని అసదుద్దీన్ తీవ్రంగా ఖండించారు. వికారుద్దీన్ బృందం ఎన్‌కౌంటర్ బూటకమేనని, సంకెళ్ళతో వున్న వికారుద్దీన్ బృందం తుపాకీ ఎలా వాడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని అసదుద్దీన్, ముస్లిం పెద్దలు సీఎంని కోరారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో బాధిత పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని వారు కేసీఆర్ని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu