ప్రారంభమైన ఏపీ మంత్రి వర్గ సమావేశం

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, తితిదే పాలకమండలి పదవీకాలం, సభ్యుల సంఖ్యపై చట్టసవరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి గురించి చర్చించనున్నారు. ఆహార భద్రతా కార్డుల జారీకి మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశం ఉందనే సమాచారం.