Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముగిసిన కలాం అంత్యక్రియలు
posted on: Jul 30, 2015 1:20PM

మాజీ రాష్ట్రపతి, ప్రముఖ భారత క్షిపణ శాస్త్రవేత్త, భారత మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుండి రామేశ్వరానికి నిన్ననే తరలించారు. ఈరోజు రామేశ్వరం రైల్వేస్టేషన్ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మస్లిం మత పెద్దలు ఆయన పార్థివదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మత సంప్రదాయాల ప్రకారం పార్ధివదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మంత్రులు, కేంద్రమంత్రులు పారికర్, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆజాద్, టీడీపీ ఎంపీ సీఎంరమేష్, శాస్త్రవేత్తలు, కోలీవుడ్ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. అంతేకాదు కలాం అంత్యక్రియలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయి అశ్రునయనాలోత కన్నీటి వీడ్కోలు పలికారు.






